న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని గీతా కాలనీలో స్కూటర్పై వెళుతున్న తల్లీకొడుకుపై ఎద్దు దాడి చేసింది. ఈ దాడిలో బాధితులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సమీప సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో (Viral Video) వైరల్ అవుతోంది.
ఈ ఫుటేజ్లో స్కూటర్పై వెళుతున్న తల్లీకొడుకుపైకి దూసుకొచ్చిన ఎద్దు విచక్షణా రహితంగా వారిపై దాడి చేసింది. అటుగా వెళుతున్న పాదచారులు వారిని కాపాడేందుకు పరుగునవెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు.
ఎద్దు దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఎద్దును తరిమేందుకు స్ధానికులు ప్రయత్నించగా అసహనానికి లోనైన జంతువు వారిపైనా దాడి చేసేందుకు ప్రయత్నించింది.
Man, woman seriously injured after bull attacks them in Delhi’s Geeta Colony area.
CCTV video.#Delhi pic.twitter.com/N6iYV2WemB
— Vani Mehrotra (@vani_mehrotra) July 23, 2023