చాలా ఆఫీసుల్లో సిబ్బంది పనివేళల్లోనే స్నాక్స్ తింటుంటారు. కొందరైతే పనిచేస్తూనే లంచ్ కానిస్తుంటారు. అయితే, ఇలాంటి చర్యలకు ఓ బాస్ చెక్పెట్టారు. పనివేళల్లో తినడం నిషేధం అంటూ ఓ పోస్టర్ అంటించేశారు. ఈ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది.
తమ బాస్ ఆఫీసులో అంటించిన పోస్టర్ను ఓ ఉద్యోగి ఆన్లైన్లో షేర్చేశారు. ‘ఏ ఉద్యోగికూడా పనివేళల్లో ఏమీ తినకూడదు. పనివేళల్లో తింటూ కనిపించిన సహచర ఉద్యోగి గురించి సమాచారమిచ్చినవారికి రూ. 1,500 బహుమతి ఇస్తాం. మూడుసార్లు నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగిని ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తాం.’ ఇదీ ఆ పోస్టర్లోని సారాంశం. ఈ పోస్టర్ను చూసిన నెటిజన్లంతా ఆ బాస్పై మండిపడుతున్నారు. ఇంత నిరంకుశత్వమా? అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.