లాక్డౌన్ టైంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్కు అనుమతిచ్చాయి. కరోనా కేసులు తగ్గడంతో ఉద్యోగులను మళ్లీ ఆఫీసులకు రావాలని కోరాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ని కొనసాగిస్తున్నాయి. అయితే, కొందరు బాస్లకు ఈ విధానం నచ్చట్లేదు. తాజాగా అన్అకాడెమీ సీఈవో గౌరవ్ ముంజల్ ట్విట్టర్ వేదికగా కొత్తగా కంపెనీ స్థాపించినవాళ్లకు ఆసక్తికరమైన సలహా ఇచ్చాడు.
‘మీ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్ని ఇక ఆపేయండి. అందరినీ ఆఫీసుకు రమ్మనండి. నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి ఇదే చెప్పాను. ఈ సలహా నిజంగా మా సంస్థకు గేమ్ ఛేంజర్ అయిందని దాదాపు వాళ్లందరి నుంచి నాకు మెసేజ్ వచ్చింది’ అని గౌరవ్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. అతడి ట్వీట్ ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ‘నిజం చెప్పాలంటే… అందరూ మీ కళ్ల ముందు ఉండాలని కోరుకుంటున్నారు’ అంటూ ఒక ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశాడు.
అన్అకాడెమీ అనేది పాపులర్ ఎడ్యుటెక్ కంపెనీ. బెంగళూరుకు చెందిన గౌరవ్ ముంజల్, హిమేశ్ సింగ్, రోమన్ సైనీలు 2015లో ఈ సంస్థను ఏర్పాటుచేశారు. పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యేవాళ్లకు ఆన్లైన్లో పాఠాలు చెప్తారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా నిర్వహిస్తారు. ఇంగ్లీషుతో పాటు 14 భారతీయ భాషల్లో పాఠాలు చెప్తారు.ఈ సంస్థ 2019లో అన్అకాడమీ ప్లస్ పేరుతో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చింది.
The first piece of advice I give every early stage Founder I meet is to ban remote work in their org and call everyone back to Office (except for genuine cases).
In almost every case I get a message a few weeks later saying that this advice was game changing for their org.
— Gaurav Munjal (@gauravmunjal) November 17, 2022