‘అమెరికాలో 20 ఏండ్లు ఉండి వచ్చిన. హైదరాబాద్ బస్తీల్లో ఉన్న బాధలు తెలుసు. వారికేం కావాలో కనుక్కుంటా. గల్లీగల్లీ పర్యటిస్తా. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు, పరిశుభ్రత చాలా కీలకం. బస్తీల్లో సమస్యలే కాదు. గృహ హింస సమస్యలు అధికం. వాటిని ఒక లాయర్గా, ఒక మేయర్గా తప్పకుండా పరిష్కరిస్తా. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది. అన్ని రంగాల్లో మార్పు వచ్చింది. డైనమిక్ లీడర్, మంత్రి కేటీఆర్ వల్లే సాధ్యమైంది. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తా. ఒక విజన్తో, పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతా. విద్య, వైద్యం రెండూ ప్రధానమే. జోడెడ్లలా వీటిని మార్చాలన్నదే కర్తవ్యం. నాలాల ఆక్రమణల వల్లే మొన్న వరదలు నగరాన్ని ముంచెత్తినయి. ఇక నుంచి కబ్జాలు జరగకుండా పకడ్బందీగా వ్యహరిస్తా. సభ పెద్దగా అందర్నీ కలుపుకొని పోతా. భేషజాలకు పోతే సమస్యలు తీరవు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను. సార్ నగరాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో అట్ల చేసి చూపిస్తా’ అంటున్నారు జీహెచ్ఎంసీ నూతన మేయర్ గద్వాల విజయలక్ష్మి. మీడియాతో ఆమె ముచ్చటించారు.