Kashi Gaya Pavithra Pind Daan Yatra | తెలుగు రాష్ట్రాల నుంచి పలు రూట్స్లో ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను (Bharat Gaurav Tourist Train) ఆపరేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ టూరిస్ట్ ప్యాకేజీలలో పుణ్య క్షేత్ర యాత్ర (Punya Kshetra Yatra) బాగా పాపులర్ అయింది. తాజాగా కాశీ గయ పవిత్ర పిండ దాన్ యాత్ర (Kashi Gaya Pavithra Pind Daan Yatra) పేరుతో మరో టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో పర్యాటకులు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు.
కాశీ గయ పవిత్ర పిండ దాన్ యాత్ర (Kashi Gaya Pavithra Pind Daan Yatra) పేరు టూర్ ప్యాకేజీ అందిస్తోండగా.. సెప్టెంబర్ 26, అక్టోబర్ 8 తేదీలలో ఈ ప్యాకేజీ (Tour Package)ని బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో గయ (Gaya), వారణాసి (Waranasi), ప్రయాగ్రాజ్ (Prayagaraj) వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ (Hyderabad Package) ప్రారంభం అవుతుండగా.. ఇది 7 రాత్రులు, 8 రోజులు (7 days 8 nights) కొనసాగుతుంది.
కాశీ గయ పవిత్ర పిండ దాన్ యాత్ర ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు సికింద్రాబాద్ (Secunderabad)లో టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) నుంచి ఈ రైలు మొదలవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లోని కాజీపేట(Kazhipeta), ఖమ్మం (Khammam), విజయవాడ (Vijayawada), ఏలూరు (Eluru), రాజమండ్రి (rajamahendravaram), సామర్లకోట (Samarlakota), పెందుర్తి (Pendurthi), విజయనగరం (VJN), పలాస (Palasa) తదితర స్టేషన్లలో ఆగుతుంది.
Day 2: రెండో రోజు పూర్తిగా ప్రయాణం ఉంటుంది.
Day 3: మూడో రోజు ఉదయం గయ (Gaya)కు చేరుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ అనంతరం పిండ ప్రదాన కార్యక్రమాలు చేస్తారు. తర్వాత మీ సోంత ఖర్చుతో బోధ్ గయ (Bodha Gaya)లోని దేవాలయాలను చూడవచ్చు. రాత్రికి భోజనం తర్వాత గయలో బస ఉంటుంది.
Day 4: నాలుగో రోజు కూడా గయలో పిండప్రదాన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఆ తర్వాత విష్ణుపాద ఆలయ దర్శనం (Vishnupadha Darshanam) ఉంటుంది. ఆ తర్వాత వారణాసి (waranasi) బయలుదేరుతారు.
Day 5: ఐదో రోజు ఉదయం వారణాసి చేరుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ అయ్యి అల్పాహారం చేసిన తర్వాత వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని(Kashi Vishwanatha temple) దర్శించుకుంటారు. తర్వాత అక్కడే ఉన్న కాశీ కారిడార్ (Kashi Corridar), సాయంత్రం గంగా హారతి (Ganga Harathi) చూడొచ్చు. ఆ తర్వాత ప్రయాగ్రాజ్(Prayagaraj) బయలుదేరుతారు.
Day 6 : ఆరో రోజు ప్రయాగ్రాజ్ చేరుకుంటారు. అల్పాహారం చేసిన తర్వాత త్రివేణి సంగమం Triveni Sangam (గంగ, యమునా, సరస్వతి నదుల) సందర్శన ఉంటుంది. అనంతరం ప్రయాగ్రాజ్ నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది.
Day 7, 8 : ఏడో రోజు, ఎనిమిదో రోజు పూర్తిగా ప్రయాణం ఉంటుంది. ఎనిమిదో రోజు ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లోని పలాస, విజయనగరం, పెందుర్తి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేటలో ఆగుతూ సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
‘కాశీ గయ పవిత్ర పిండ దాన్ యాత్ర’ ప్యాకేజీ ధర ( Kashi Gaya Pavithra Pind Daan Yatra Package details)
Kashi Gaya Pavithra Pind Daan Yatra Tour cost | ‘కాశీ గయ పవిత్ర పిండ దాన్ యాత్ర’ టూర్ ప్యాకేజీ ధర చూస్తే మూడు కేటగిరీల్లో అందుబాటులో ఉంటుంది. ఎకానమి డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.13,900. స్టాండర్డ్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.22,300. కంఫర్ట్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.29,300. నిర్ణయించారు. ఈ టూర్ ప్యాకేజీలో AC వసతి, హోటల్లో బస, బ్రేక్ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి.
Embark on a soul-awakening journey with ‘Kashi-Gaya Pavithra Pind Daan Yatra’ (SCZBG12). Starting on 26.09.2023 from Secunderabad.
Book now on https://t.co/JyCn9sxOnd #BharatGaurav #IRCTC #DekhoApnaDesh pic.twitter.com/TFZ2HMnf5j
— IRCTC Bharat Gaurav Tourist Train (@IR_BharatGaurav) August 20, 2023