Lakshadweep Tour packages | ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ఉష్ణమండల ద్వీప వ్యవస్థలలో లక్షద్వీప్ ఒకటి. కేరళ తీరానికి 220-440 కిలో మీటర్ల దూరంలో ఇది ఉంది. ఈ ద్వీపాలు విలువైన పర్యావరణ, సాంస్కృతిక వారసత్వాన్ని భావి తరాలకు అందిస్తున్నాయి. ఈ ద్వీపాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది పగడపు దిబ్బ. ఇది ఒక సహజమైన విశ్రాంతి ప్రదేశం. ఈ లక్షద్వీప్ 36 ద్వీపాల సమూహం. ఈ లక్షద్వీప్ నీటి అడుగున దృశ్యాలు రంగురంగులుగా ఊపిరిబిగపట్టి చూడాల్సినంత సుందరంగా ఉంటాయి. లక్షద్వీప్ సరస్సు ఈత కొట్టడానికి, విండ్-సర్ఫింగ్, డైవింగ్, స్నార్కెలింగ్, కయాకింగ్ లాంటి నీటి క్రీడలకు అనువుగా ఉంటుంది.
ఇక్కడ ప్రతి ద్వీపంపైన మంచు తెల్లని పగడపు ఇసుకతో కప్పి ఉంటుంది. తేట తెల్లని నీరు, రకరకాల సముద్ర జీవులు ఈ ద్వీపాల అందాన్ని ఇనుమడింపజేస్తుంటాయి. ఈ ద్వీపాలు ప్రధాన భూభాగానికి అనుసంధానమై, పర్యాటకుల కోసం ఇక్కడ ఓడ, హెలికాప్టర్, ఎయిర్లైన్స్, మెకనైజ్డ్ సెయిలింగ్ లాంటి సదుపాయాలను కలిగి ఉన్నాయి. ఈ లక్షద్వీప్ను సందర్శించాలనుకునే వారికి రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఆ ప్యాకేజీల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
లక్షద్వీప్ సముద్రం అనేది ఐదు రోజుల సముద్ర యాత్ర. M.V కవరత్తి ఓడలో కవరత్తి, కల్పేని, మినీకాయ్ దీవులను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ కింద ఐదు రోజుల దీవుల పర్యటన పగటిపూట ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ అందిస్తారు. రాత్రి వేళల్లో ఓడలోనే బస చేస్తారు. M.V కవరత్తిలో 150 డైమండ్ క్లాస్ వసతి ఉంది. పగటిపూట యాత్ర సందర్భంగా ఈత, స్నార్కెలింగ్ ఇతర వాటర్ స్పోర్ట్స్ను సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ఏడాది నుంచి 10 ఏళ్ల వయసు వరకుగల పర్యాటకులను చిన్న పిల్లలుగా పరిగణిస్తారు.
చార్జీలు (డైమండ్ క్లాస్)
పెద్దలకు – రూ.37500 + 5 శాతం జీఎస్టీ
పిల్లలకు – రూ.33000 + 5 శాతం జీఎస్టీ
చార్జీలు (గోల్డ్ క్లాస్)
పెద్దలకు – రూ.28500 + 5 శాతం జీఎస్టీ
పిల్లలకు – రూ.22500 + 5 శాతం జీఎస్టీ
నోట్: డిసెంబర్ నెలలో 10 శాతం పెంపు వర్తిస్తుంది.
ఈ స్వేయింగ్ పామ్ ప్యాకేజీ అనేది మినికాయ్ దీవికి ఆరు నుంచి ఏడు రోజుల టూర్. పర్యాటకుల కోసం ప్రత్యేకమైన A/c కాటేజీలతోపాటు బీచ్ల ముందు నిర్మించిన ఇతర వ్యక్తిగత కాటేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. M.V అరేబియన్ సముద్రం, M.V లక్షద్వీప్ సముద్రం, M.V. మినికాయ్, M.V. అమిందివి, M.V కవరత్తి ఓడలలో ప్రయాణం సాగుతుంది.
మెరైన్ వెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ 4 నుంచి 7 రోజుల ప్యాకేజీ. కద్మత్ వరకు ఈ టూర్ ఉంటుంది. సముద్ర జీవుల ఔన్నత్యాన్ని, అందాలను ఆస్వాదించడానికి ఈ ప్యాకేజీ బాగుంటుంది. ఈ ప్యాకేజీలో ప్రతి పర్యాటకుడు దీవిపై 2 నుంచి 5 రోజులు సరదాగా గడపవచ్చు. వాటర్ స్పోర్ట్స్లో భాగంగా స్విమ్మింగ్, స్నార్కెలింగ్, కయాకింగ్ లాంటి ఆటలను ఎంజాయ్ చేయవచ్చు. కద్మత్లో పూర్తిస్థాయి వాటర్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఉంది. సాహసం చేయగలిగిన వారు స్కూబా డైవింగ్, విండ్ సర్ఫింగ్, పారా సెయిలింగ్ లాంటి ఆటల్లో మునిగితేలవచ్చు.
చార్జీలు
సూపర్ డీలక్స్ ఏసీ రూమ్కు ఇద్దరికైతే రూ.11 వేలు, ఒక్కరికైతే రూ.8 వేలు. అదనంగా ప్రతి మనిషికి రూ.5 వేలు. డీలక్స్ ఏసీ రూమ్కు ఇద్దరికి రూ.9 వేలు, ఒక్కరికి రూ.6 వేలు, అదనంగా ప్రతి మనిషికి రూ.4 వేలు. ఎసీ స్టాండర్డ్ రూమ్కు ఇద్దరికి రూ.7 వేలు, ఒక్కరికి రూ.5 వేలు, అదనంగా ప్రతి మనిషికి రూ.3500. నాన్ ఏసీ రూమ్కు ఇద్దరికి రూ.5 వేలు, ఒక్కరికి రూ.3 వేలు, అదనంగా ప్రతి మనిషికి రూ.2500. డిసెంబర్లో 10 శాతం పెంపు వర్తిస్తుంది.
తారాతాషి ప్యాకేజీ కవరత్తి దీవి సందర్శనకు సంబంధించినది. కవరత్తి లక్షద్వీప్ పరిపాలనా రాజధాని. ప్యాకేజీలో భాగంగా దీవిలో నాలుగు నుంచి ఐదు రోజుల బస ఉంటుంది. అద్దపు అడుగు కలిగిన బోటులో స్విమ్మింగ్, స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ చేయవచ్చు. ప్యాకేజీలో భాగంగా ఇతర వాటర్ స్పోర్ట్స్ను కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ టూర్తో మీ హాలీడేస్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ ద్వీపంలో బీచ్ ముందుగల పర్యాటకుల గుడిసెల్లో బస ఉంటుంది.
చార్జీలు
సూట్ రూమ్కు ఇద్దరైనా ఒక్కరైనా కనీసం రూ.11 వేలు, అదనంగా ప్రతి వ్యక్తికి రూ.4 వేలు.
ఈ ప్యాకేజీ మీరు మీ సొంత దీవుల్లో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. తిన్నకర దీవి బంగారం దీవికి ఎదురుగా ఉంటుంది. విస్తారమైన సరస్సు తీరంతోపాటు పగడపు ఒడ్డును కలిగి ఉండటం ఈ దీవి ప్రత్యేకత. ఈ తిన్నకర అనేది అగట్టి నుంచి ఈశాన్యంగా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న కన్నీటి చుక్క ఆకారపు దీవి. ఈ దీవిలోని పనోరమా ఆవరణ, అద్భుతమైన సరస్సులు, సిల్వాన్ సముద్ర తీరాలు, ఎండలో తడిసిన ఇసుక, అద్భుతమైన సముద్ర వృక్షజాలం, జంతుజాలం మిమ్ములను మంత్రముగ్ధులను చేస్తుంది. కయాక్స్, గ్లాస్ బాటమ్డ్ బోట్స్ లాంటి వాటర్ స్పోర్ట్స్ క్రాఫ్ట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీరు బీచ్ వాలీబాల్ ఆడవచ్చు, సన్ బాత్ చేయవచ్చు.
చార్జీలు
గుడారాలకు అద్దె ఇద్దరికి రూ.10 వేలు, ఒక్కరికి రూ.8 వేలు, అదనంగా ప్రతి వ్యక్తికి రూ.4 వేలు.
ఈ బంగారం దీవి 120 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ దీవిలో జనావాసాలు లేవు. ఈ దీని పగడపు దిబ్బలచే ఆవరింపబడిన సరస్సుతో చుట్టుముట్టబడి ఉంటుంది. ఇది ప్రపంచంలోని ఉత్తమ విహార ప్రదేశంగా గుర్తింపు పొందింది. బంగారం దీవి నిండా ఉన్న కొబ్బరి తోటల్లో అందమైన చేపలు, పందికొక్కులు, చిలుకలు, పఫర్ ఫిష్లు, సన్యాసి పీతలు, సముద్ర పక్షులు కనువిందు చేస్తాయి. స్కూబా డైవింగ్, బీచ్ గేమ్స్, స్విమ్మింగ్, స్నార్కెలింగ్, డీప్ సీ ఫిషింగ్ వంటి అనేక సాహసాలు చేసే సౌకర్యం ఉంది. రిసార్ట్లో 60 పడకల బీచ్ కాటేజీలు (నాన్ ఏసీ), అనేక వంటకాలను అందించే బహుళ-వంటకాల రెస్టారెంట్ ఉన్నాయి. విమానాశ్రయం ఉన్న అగట్టి నుంచి బంగారం దీవికి చేరుకోవచ్చు.
చార్జీలు
కాటేజీల చార్జీ ఒక్కరైనా ఇద్దరైనా కనీసం రూ.18 వేలు, అదనంగా ప్రతి వ్యక్తికి రూ.8500.
ఈ ప్యాకేజీలో భాగంగా అన్ని డైవింగ్ పరికరాలను అందిస్తారు. స్విమ్మింగ్ స్కిల్స్, డైవింగ్కు అభ్యర్థి ఫిట్గా ఉన్నట్లు తెలిపే డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి. డైవింగ్ కోర్సులో పాల్గొనడానికి కనీస వయస్సు 14 సంవత్సరాలు ఉండాలి.