IRCTC Tour Package | మీరు పర్యాటక ప్రియులా!.. అయితే మీ కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్లో తిరుపతి (Tirupati), తిరుమల (Tirumala) సందర్శించేలా… ‘గోవిందం’ (Govindham) పేరిట హైదరాబాద్ నుంచి తిరుమల టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రైలు (Train Route) మార్గంలో ఈ టూర్ను ఆపరేట్ చేస్తుండగా.. ఈ మేరకు పూర్తి వివరాలను ప్రకటించింది.
‘గోవిందం’ (Govindham) పేరుతో ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. జూన్ 3వ తేదీన ఈ ప్యాకేజీ (Govindham Tour Package) అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుపతి (Tirupati), తిరుమల (Tirumala), లాంటి అధ్యాత్మిక (Spritual Places) ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 2 రాత్రులు, 3 రోజులు కొనసాగుతుంది.
ఐఆర్సీటీసీ ‘గోవిందం’ ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్లో టూర్ ప్రారంభం అవుతుంది. లింగంపల్లి (Lingampally) నుండి సాయంత్రం 05:25 గంటలకు రైలు (Train no 12734) బయలుదేరుతుంది. సికింద్రాబాద్ 06:10 గంటలకు చేరుకుంటుంది. నల్గొండ నుంచి 07:38 గంటలకు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
Day 2: రెండో రోజు ఉదయం 05:55 గంటలకు తిరుపతి (Tirupati)కి చేరుకుంటారు. ఐఆర్సీటీసీ పికప్ చేసుకుని.. హోటల్కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత, వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara) ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) కోసం ఉదయం 09:00 గంటలకు తిరుమలకు బయలుదేరాలి. . తిరుగు ప్రయాణంలో సాయంత్రం 06:25 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్లో రైలు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
Day 3: నల్గొండకు ఉదయం 03:04 గంటలకు చేరుకుంటారు, సికింద్రాబాద్కు 05:35 గంటలకు, లింగంపల్లికి 06:55 గంటలకు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ ‘గోవిందం’ టూర్ ప్యాకేజీ ధర ( Govindham Tour cost )
ఇక చార్జీల విషయానికి వస్తే.. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.6,790 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ. 5,660, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ. 5,660గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 4940గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీ రూ. 3800, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ. 3800గా నిర్ధారించారు. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనం. రైలు టికెట్లు, హోటల్లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్(Travel Insurance) ఉంటాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR084