IRCTC Hyderabad to Nasik Package | ఈ వేసవిలో సరికొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు పర్యాటకులు..! కొందరు సేద తీరే ప్రాంతాలను ఎంచుకుంటే… మరికొందరు అధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలని చూస్తారు. అయితే అధ్యాత్మిక పర్యటనలో భాగంగా నాసిక్ త్రయంబకేశ్వర్(Nashik Trimbakeshwar), షిరిడీ (Shiridi) వెళ్లే పర్యాటకుల కోసం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). ‘సాయి శివం’(Sai Shivam) పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోండగా.. రైలు మార్గంలో(Train Route) ఈ టూర్ను ఆపరేట్ చేస్తున్నారు.
‘సాయి శివం’ (Sai Shivam) పేరుతో ఐఆర్సీటీసీ (IRCTC) ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. ప్రతి శుక్రవారం ఈ ప్యాకేజీ ( Sai Shivam Tour Package) అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో నాసిక్ త్రయంబకేశ్వర్, షిరిడీ ఆలయం, పంచవటి (Panchavati) లాంటి అధ్యాత్మిక (Spiritual) ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది.
ఐఆర్సీటీసీ ‘సాయి శివం’ ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్లో(Hyderabad) టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 6:50 గంటలకు ట్రైన్ (అజంతా ఎక్స్ప్రెస్ Ajantha express) ఉంటుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
Day 2: రెండో రోజు ఉదయం 7:10 గంటలకు నాగర్సోల్ రైల్వే స్టేషన్(Nagarsol railway Station)కు చేరుకుంటారు. ఐఆర్సీటీసీ పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళుతుంది. ఆ తర్వాత హోటల్లో చెక్ ఇన్ అవ్వడం.. అనంతరం షిరిడీ ఆలయం (Shiridi Special darshan) దర్శనం ఉంటుంది. సాయంత్రం షిరిడీలో తిరగొచ్చు. భోజనం తర్వాత రాత్రి షిరిడీలో బస ఉంటుంది.
Day 3: మూడో రోజు ఉదయం అల్పాహారం చేసి.. షిరిడీలో హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. నాసిక్లోని త్రయంబకేశ్వర్కు వెళతారు. అనంతరం పంచవటి దర్శనం ఉంటుంది. తర్వాత నాగర్సోల్ స్టేషన్లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
Day 4: ఉదయం 08:50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ ‘సాయి శివం’ టూర్ ప్యాకేజీ ధర (Sai shivam)
ఇక చార్జీల విషయానికి వస్తే.. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6630, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5890 చెల్లించాలి. స్టాండర్డ్ క్లాస్లో డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4940, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4200 చెల్లించాల్సి ఉంటుంది. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11730, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6550, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4910గా ధర నిర్ణయించారు. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. మే నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాకేజీలో షిరిడీ దర్శనం. రైలు టికెట్లు, హోటల్లో వసతి, ట్రావెల్ ఇన్స్యూరెన్స్(Travel Insurance) ఉంటాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR008