IRCTC Hyderabad to Nasik Package | ఈ వేసవిలో సరికొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు పర్యాటకులు..! కొందరు సేద తీరే ప్రాంతాలను ఎంచుకుంటే… మరికొందరు అధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలని చూస్తారు. అయితే అధ్యాత్మిక పర్యటనలో భాగంగా షిరిడీ (Shiridi), శని శింగణాపూర్ (Shani Shinganapur) వెళ్లే పర్యాటకుల కోసం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). సాయి సన్నిధి ఎక్స్ హైదరాబాద్ (SAI SANNIDHI EX HYDERABAD) పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోండగా.. రైలు మార్గంలో(Train Route) ఈ టూర్ను ఆపరేట్ చేస్తున్నారు.
సాయి సన్నిధి ఎక్స్ హైదరాబాద్ (SAI SANNIDHI EX HYDERABAD) పేరుతో ఐఆర్సీటీసీ (IRCTC) ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. ప్రతి బుధవారం ఈ ప్యాకేజీ ( SAI SANNIDHI Tour Package) అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీ ఆలయం, శని శింగణాపూర్ (Shani Shinganapur) లాంటి అధ్యాత్మిక (Spiritual) ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 2 రాత్రులు, 3 రోజులు కొనసాగుతుంది.
ఐఆర్సీటీసీ ‘సాయి సన్నిధి’ ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు హైదరాబాద్లో(Hyderabad) టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 6:50 గంటలకు ట్రైన్ (అజంతా ఎక్స్ప్రెస్ Ajantha express) ఉంటుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
Day 2: రెండో రోజు ఉదయం 7:10 గంటలకు నాగర్సోల్ రైల్వే స్టేషన్(Nagarsol railway Station)కు చేరుకుంటారు. ఐఆర్సీటీసీ పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళుతుంది. ఆ తర్వాత హోటల్లో చెక్ ఇన్ అవ్వడం.. అనంతరం షిరిడీ ఆలయం (Shiridi Special darshan) దర్శనం ఉంటుంది. అక్కడ నుంచి శని శింగణాపూర్ (Shani Shinganapur) బయలుదేరుతారు. శని ఆలయం దర్శనం అనంతరం నాగర్సోల్కు బయలుదేరుతారు. తిరుగు ప్రయాణంకు నాగర్సోల్ స్టేషన్లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
Day 3: మూడో రోజు ఉదయం 08:50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ ‘సాయి సన్నిధి’ టూర్ ప్యాకేజీ ధర (SAI SANNIDHI EX)
ఇక చార్జీల విషయానికి వస్తే.. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6090, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5420 చెల్లించాలి. స్టాండర్డ్ క్లాస్లో డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4400, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.3730 చెల్లించాల్సి ఉంటుంది. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.12100, డబుల్ ఆక్యుపెన్సీకి రూ6530. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5400గా ధర నిర్ణయించారు. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. మే నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాకేజీలో షిరిడీ దర్శనం. శని శింగణాపూర్, రైలు టికెట్లు, హోటల్లో వసతి, ట్రావెల్ ఇన్స్యూరెన్స్(Travel Insurance) ఉంటాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR009