దివ్యాంగులు అంటేనే దైనందిన జీవితావసరాలకు ఇతరులపై ఆధారపడేవారు. మరొకరి సాయం లేకుండా ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేనివారు. అలాంటివారికి రాష్ట్ర ప్రభుత్వం అపారమైన ఆత్మవిశ్వాసంతోపాటు అత్యాధునిక ఉపకరణాలు, ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి నవజీవనానికి నాందిపలుకుతున్నది. సర్కారు అందిస్తున్న భరోసాతో దివ్యాంగులు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు కల్పిస్తున్న భరోసాపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 10,46,822 (2.96 శాతం) మంది దివ్యాంగులు ఉన్నారు. అందులో అంధులు, బధిరులు, వినికిడి లోపాలతోపాటు, శారీరక, మానసిక వైకల్యం కలిగినవారు ఉన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా కృషి చేస్తున్నది. ప్రతినెలా 5 లక్షల మందికి రూ. 3,016 చొప్పున ఆసరా పింఛన్ అందజేస్తున్నది. దేశంలోనే దివ్యాంగుల పింఛన్ కోసం ఏడాదికి రూ.1,800.96 కోట్లు వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. పింఛన్లతోపాటు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నది. దేశంలో తొలిసారి మలక్పేట్లో పార్క్ను ఏర్పాటు చేసింది. సబ్సిడీ రుణాలు అందజేస్తూ స్వశక్తితో ఎదిగేందుకు కృషి చేస్తున్నది.
అత్యాధునిక ఉపకరణాలు
రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వేలాది రూపాయల విలువైన ఉపకరణాలను అందజేస్తున్నది. గడిచిన ఏడాదిలో రూ. 20 కోట్లతో వివిధరకాల ఉపకరణాలను అందజేసింది. దివ్యాంగ విద్యార్థులకు 4జీ స్మార్ట్ఫోన్లు, ఎన్వీడీఏ (నాన్ విజువల్ డిసేబుల్డ్ యాక్సెస్), జాస్ వంటి ప్రత్యేక సాఫ్ట్వేర్లతో ల్యాప్టాప్లు, అంధుల కోసం డిజిటల్ టెక్నాలజీతో రూపొందించిన కేన్ స్టిక్లు, నడువలేని, కదలలేని వారికి బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, స్కూటీలు అందజేస్తున్నది. ప్రభుత్వం అందజేసిన ఉపకరణాల సాయంతో దివ్యాంగులు ఎవరి సాయం లేకుండానే తమ దైనందిన కార్యాలను పూర్తిచేసుకుంటున్నారు. కొందరు స్వయం ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
దివ్యాంగులకు సర్కారు ఇచ్చే వసతులు
2016 దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకూ ప్రత్యేక చర్యలు
ఎక్కడా లేని విధంగా పింఛన్లు
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించని విధంగా కేసీఆర్ సర్కారు పింఛన్ల కోసం రూ.1,800 కోట్లు వెచ్చిస్తున్నది. ఖరీదైన అత్యాధునిక ఉపకరణాలను అందిస్తున్నది. ఇలాగే దివ్యాంగుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకోవాలి. 2016 వికలాంగుల చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు విద్యా, ఉపాధి అవకాశాలను పొందేవిధంగా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నది. అత్యాధునిక ఉపకరణాలను అందజేస్తున్నది. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.
ఉన్నత స్థానాలకు చేరుకోవాలి
ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. దివ్యాంగులు ఆత్మన్యూనతాభావాన్ని విడనాడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అన్నిరంగాల్లో రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా.
కేసీఆరే నాకు దేవుడు
నాకు పుట్టుకతోనే కాళ్లు లేవు. ఇం ట్లోనే ఉంటున్న. మూన్నెళ్ల కిందట ప్రభు త్వం బ్యాటరీతో నడిచే సైకిల్ ఇచ్చింది. కోళ్లఫాం పెట్టుకున్న. దాణా, మందులు సైకిల్పై తెచ్చుకుంటున్న. 3 వేల పింఛ న్, ట్రై సైకిల్ సీఎం కేసీఆర్ సారు పుణ్యమే. ఆయనే నాకు దేవుడు.
ల్యాప్టాప్తో ఉద్యోగం సాధించిన
చిన్నతనం నుంచి ఒక్క కన్నే కనిపిస్త ది. డీఎడ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభు త్వం ఎన్వీడీఏ సాఫ్ట్వేర్తో ల్యాప్టాప్ ఇచ్చింది. ఆడియో పాఠాలు విని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యా. 2019లో ఉ పాధ్యాయుడిగా ఎంపికయ్యా. ప్రభు త్వం ల్యాప్టాప్ ఇవ్వకపోతే ఉద్యోగం రాకపోయేది.
ఎవరి సాయం లేకుంట కాలేజీకి వెళ్తున్న
నాన్న చిన్నతనంలోనే చనిపోయారు. అమ్మ దినసరి కూలి. రెండేండ్ల వయస్సులోనే పోలియో బారిన పడ్డ. నడవలేని స్థితి. స్కూల్కు, కాలేజీకి వెళ్లేందుకు ఎన్నో తిప్పలు వడ్డ. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ప్రభుత్వం స్కూటీ ఇచ్చింది. ఇప్పుడు ఎవరి సాయం లేకుంట కాలేజీకి వెళ్లి వస్తున్నా.
ఉన్నత చదువులకు ఎంతో ఉపయోగపడుతున్నది
నేను డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నాకు ల్యాప్టాప్ ఇ చ్చింది. ఉన్నత చదువులకు ఎంతో ఉప యోగపడుతున్నది. డిగ్రీ పూర్తయింది. పీజీ చేస్తున్నా. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అ వుతున్న. ఆడియో పాఠాలను వింటున్నాను. కచ్చితంగా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకమున్నది.