ఖైరతాబాద్, జూలై 1: జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలకు చెక్ పవర్ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎంపీసీటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడీల కుమార్గౌడ్ తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు తన్నీరు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ .. మండల పరిషత్తులకు రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు గౌరవ వేతనాలను పెంచడం పట్ల హర్షం వ్యక్తంచేశారు.
అసెంబ్లీ, మండలి సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఎంపీటీసీల సమస్యల గురించి మాట్లాడారని కొనియాడారు. ఎంపీటీసీలకు ఏటా రూ.20 లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, గ్రామపంచాయతీలో ప్రత్యేక గది, కుర్చీ ఏర్పాటు చేయాలని, పాఠశాలల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, కోశాధికారి మన్నె రాజు, కార్యవర్గ సభ్యులు పెగడ శ్రీనివాస్, కనిక, రాములు, గడ్డ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.