హైదరాబాద్ : మొక్కలు నాటడంలో యువత ముందుండాలని గిన్నిస్ రికార్డు గ్రహీత, మైక్రో ఆర్టిస్ట్ రామగిరి స్వారిక అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జీహెచ్ఎంసీ పార్కులో ఆమె మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా స్వారిక మాట్లాడుతూ..ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
అనంతరం తన స్నేహితులు చంద్రకాంత్ చారి, గౌరీ నాథ్, రూపశిల్పి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.