హైదరాబాద్ : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికి కొరియా కంపెనీ యంగ్వన్ కార్పొరేషన్ భారీ విరాళం ఇచ్చింది. 10 వేల రెమ్డిసివిర్ ఇంజెక్షన్లు, లక్ష కేఎన్95 మాస్కులను విరాళంగా ఇచ్చింది. జులై 1వ తేదీన 5 వేల డోసులు హైదరాబాద్కు రాగా, మిగతా డోసులను జులై 8 నాటికి పంపిణీ చేస్తామని యంగ్ వన్ కార్పొరేషన్ చైర్మన్ కిహాక్ సంగ్ తెలిపారు.
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తరపున యంగ్ వన్ కార్పొరేషన్కు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిందని, సెకండ్ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొగలిగామని పేర్కొన్నారు. కరోనా తగ్గుముఖం పడుతుండటంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఇండియాలోని తన అనుబంధ సంస్థ ఎవర్టాప్ టెక్స్టైల్, అపెరాల్ కాంప్లెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా యంగ్ వన్ కార్పొరేషన్ వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 12 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.