Suicide | సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 14 : పెండ్లి వాయిదాపడటంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని సుందరయ్యకాలనీలో చోటుచేసుకున్నది.
సీసీసీ నస్పూర్ ఎస్ఐ ప్రశాంత్ కథనం ప్రకారం.. కాలనీకి చెందిన కార్య రజిత (19), ఉప్పు మహేశ్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం కావడంతో ఇరు కుటుంబాలు వివాహానికి ఒప్పుకొన్నారు. కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం చేశారు. మహేశ్ తన ఇంటి నిర్మాణం కోసం కొన్ని రోజులు పెండ్లి వాయిదా వేయాలని యువతి కుటుంబసభ్యులను కోరగా, మనస్తాపం చెందిన రజిత ఈ నెల 13న పురుగులమందు తాగింది. కుటుంబసభ్యులు గమనించి గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి చెన్నప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.