స్ట్రీట్ ఆర్ట్.. అనే పదాన్ని మనం తక్కువగా విని ఉంటాం. ఈమధ్య ఈ పదం బాగా ఫేమస్ అవుతోంది. ఎందుకంటే.. ప్రస్తుతం స్ట్రీట్ ఆర్ట్ కు ఆదరణ పెరుగుతోంది. సాధారణంగా ప్రజల్లో కానీ.. యువతలో కానీ.. విద్యార్థుల్లో కానీ చైతన్యాన్ని తీసుకురావాలంటే చాలామంది పాటలతో చైతన్య పరుస్తుంటారు. పాటల కంటే కూడా ఎక్కువగా స్ట్రీట్ ఆర్ట్ తో ప్రజలను చైతన్య పరచవచ్చని ఈ జంట నిరూపించింది.
జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్స్ చదివిన ఓ జంట.. పెళ్లి చేసుకొని.. ఇద్దరి కలను సాకారం చేసుకుంటున్నారు. ఇద్దరికీ స్ట్రీట్ ఆర్ట్ అంటే ఇష్టం కావడంతో ఇద్దరూ కలిసి ఇప్పటి వరకు 40 వరకు స్ట్రీట్ ఆర్ట్స్ వేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.
2015 లో వరంగల్ లో ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు లేక మూతపడిపోతోందని తెలుసుకొని.. విద్యార్థులను వాళ్ల తల్లిదండ్రులను చైతన్య పరిచేందుకు ఓ స్ట్రీట్ ఆర్ట్ వేసి అందరి ప్రశంసలు పొందారు. అలా.. సమాజంలో ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల మీద అవగాహన కల్పించడం కోసం స్ట్రీట్ ఆర్ట్స్ వేస్తున్నారు.
ఇటీవల ఈ జంట.. వరంగల్ లో పబ్లిక్ లైబ్రరీ గొప్పదనాన్ని తెలియజేస్తూ వేసిన స్ట్రీట్ ఆర్ట్ ను చూసి అక్కడి ప్రజలు ఈ జంటను తెగ ప్రశంసించారు. వాళ్ల ఆర్ట్ వర్క్ ను జపాన్, కెనడా, ఫ్రాన్స్, లండన్ లాంటి దేశాల్లోనూ ప్రదర్శించారు. భవిష్యత్తులోనూ ఇంకా మరెన్నో సమాజ స్పృహ కల్పించే ఆర్ట్ వర్క్స్ ను వేస్తామని ఆ జంట చెప్పుకొచ్చింది. వాళ్లు వేసిన కొన్ని ఆర్ట్ వర్క్స్ ను మీరు కూడా చూడండి.