హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఇటీవల అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ఆ పార్టీ నాయకత్వం వేటువేసింది.
రూరల్ ఇన్చార్జి బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించింది. ఇన్చార్జి నియామకం కోసం పలువురి పేర్లను పరిశీలించినప్పటికీ.. చివరకు ఆదాల పేరునే ఖరారు చేసింది.