హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగా ణ): నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన వడ్త్యావత్ యశ్వంత్ నాయక్ సివిల్స్లో సత్తా చాటారు. ఆల్ ఇండియా ఫలితాల్లో 627వ ర్యాంకు సాధించారు. పద్మ, ఉమాపతి దంపతుల కుమారుడైన యశ్వంత్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి, నారాయణ కాలేజ్లో ఇంటర్, మద్రాస్లో ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత గుర్గావ్లో కొన్ని నెలలు ఉద్యోగం చేశాక సివిల్స్పై మక్కువతో బాగా చదివి ర్యాంక్ సాధించారు. సివిల్స్లో ర్యాంక్ సాధించిన తన కుమారుడికి తల్లి పద్మ స్వీట్ తినిపించి సంబురపడ్డది.