యాదాద్రి, జూన్ 14 : యాదగిరి గుట్ట లక్ష్మీనృసింహుడిని మంగళవా రం 15 వేల మంది భక్తులు దర్శించుకొన్నారు. ఆలయానికి రూ.19,06,712 ఆదాయం సమకూరినట్టు ఇంచార్జి ఈవో రామకృష్ణారావు తెలిపారు. ప్రధానాలయ ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకు పూజ నిర్వహించారు.
వారం రోజుల హుండీల లెక్కింపు
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఏడు రోజుల హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. రూ.69,57,943 నగదుతోపాటు మిశ్రమ బంగారం 52 గ్రాములు, మిశ్రమ వెండి రెండు కిలోల 200 గ్రాములు వచ్చినట్టు ఆలయ ఇంచార్జి ఈవో రామకృష్ణారావు తెలిపారు. దాంతోపాటు 216 అమెరికా, 280 ఆస్ట్రేలియా డాలర్లు, 10 ఇంగ్లాండ్కు చెందిన పౌం డ్స్ వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.