హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) / భువనగిరి కలెక్టరేట్: ఒకే పార్లమెంట్ పరిధిలో మూడేండ్ల సర్వీసు పూర్తయినా, కానట్లుగా ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చిన భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఏ భాస్కర్రావును ప్రభుత్వం స స్పెండ్ చేసింది. భువనగిరి లోక్సభ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఉన్న భాస్కర్రావు బదిలీ కాకూడదని తప్పు సమాచారం ఇచ్చినట్టుగా నిర్ధారించుకుని సోమవారం రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు.