హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటీఐటీసీ) వేగంగా విస్తరిస్తున్నది. కెనడా రాజధాని టోరంటోలో ఆదివారం ఐటీ రంగ ప్రముఖులు ఏర్పాటు చేసిన ‘మీట్ ఆండ్ గ్రీట్’ కార్యక్రమంలో డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ మక్త్తాల, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డబ్ల్యూటీఐటీసీ సై సోరర్ను ఆవిషరించారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో సై సోరర్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జయేశ్రంజన్ మాట్లాడుతూ.. డబ్ల్యూటీఐటీసీ కార్యక్రమాలను ప్రశంసించారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ విష్ణురెడ్డి, నరేశ్, సన్నీ చారీ, రోణిత్ బండ, అనిల్, తాళ్ల రాహుల్, నవీన్, రాజు చామర్తి తదితరులు పాల్గొన్నారు.