వేములవాడ, ఆగస్టు 31 : శ్రావణ సోమవారం సందర్భంగా వేములవాడ భీమేశ్వర ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని, ప్రసాదం కొనుగోలు చేసిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన సంతోష్ దంపతులు దర్శనం తర్వాత స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేశారు.
కవర్ తెరిచి చూడగా లడ్డూ ప్రసాదంలో పురుగు ప్రత్యక్షమైంది. తీవ్ర మనోవేదన గురైన సంతోష్ దంపతులు అధికారుల పర్యవేక్షణ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఇదే విషయమై ప్రసాదం కవర్పై ఉన్న ఫోన్ నంబర్కు ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా స్వామివారి ప్రసాదం అందించేలా చూడాలని కోరారు.