బంజారాహిల్స్, మార్చి 31: హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్య విజ్ఙాన సంస్థ (ఎల్వీపీఈఐ)కు వరల్డ్ టాప్ -10 నేత్రవైద్య సంస్థల జాబితాలో చోటుదక్కింది. స్పెయిన్కు చెందిన అంతర్జాతీయ ర్యాంకింగ్ సర్వే ఏజెన్సీ ఎస్సీ ఇమాగో ఇన్స్టిట్యూషన్స్ సంస్థ ర్యాంకింగ్స్ -2023 జాబితాను తాజాగా విడుదల చేసింది. అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్న దవాఖానల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఎల్వీపీఈఐకి 8వ ర్యాంకు, ఆసియాలో రెండో ర్యాంక్ దక్కింది. ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక భారతీయ నేత్ర ఆరోగ్య సంస్థగా ఇది నిలిచింది. ప్రఖ్యాత సంస్థ వెల్లడించిన జాబితాలో తమ సంస్థ చోటు సంపాదించుకోవడం ఆనందంగా ఉందని ఎల్వీపీఈఐ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు ఈ సందర్భంగా తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణలతో పాటు అత్యాధునిక చికిత్సలు అందిస్తున్నామని పేర్కొన్నారు.