హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్లకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వరదలు, కరువులు, ఉద్యమాలు, పోరాటాలను సమాజానికి తెలపాలన్న తపనతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఫొటోలు తీస్తుంటారన్నారని అన్నారు. అందమైన జ్ఞాపకాలు, తియ్యటి అనుభూతులు, మధుర ఘట్టాలు, విషాద సన్నివేశాలు ఇలా వెలకట్టలేని దృశ్యాలను ఒక్క ఫొటో పదిలంగా ఉంచుతుందని చెప్పారు. వంద మాటలతో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటోతో వర్ణించవచ్చని పేర్కొన్నారు. సన్నివేశాన్ని గుర్తుండిపోయేలా ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోలు భావితరాలకు మధురమైన స్మృతులుగా మిగిలిపోతున్నాయని చెప్పారు.