హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఈ-కామర్స్పై ఈ నెల 8న కవాడిగూడలోని సీజీవో కార్యాలయంలో ‘లోకల్ టు గ్లోబల్’ అంశంపై వర్క్షాప్ నిర్వహించనున్నారు. పారిశ్రామికవేత్తల్లో ఈ-కామర్స్ ఎగుమతులు, అమెజాన్, ఇండియా పోస్ట్ వంటి ప్లాట్ఫామ్స్పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన పలువురు ప్రతినిధులు అవగాహన కల్పిస్తారని చెప్పారు.