హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉన్నత విద్య అడ్మిషన్లలో మహిళలదే పైచేయిగా కనిపిస్తున్నది. డిగ్రీ, పీజీ వంటి వృత్తి విద్యాకోర్సుల్లో మహిళల హవా కొనసాగుతున్నది. 2019-20 విద్యా సంవత్సరంతో పోల్చితే 2020-21లో మహిళల ఎన్రోల్మెంట్ 4.5% పెరిగింది. ఇదే కాలం లో మొత్తం ఎన్రోల్మెంట్ 4.8% పెరగడం విశేషం. కేంద్ర విద్యాశాఖ ఆదివారం విడుదలచేసిన ఆల్ ఇండి యా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (అయిషే) నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉన్నత విద్యలో 2017-18 నుంచి ఏటా మహిళల నమోదు పెరుగుతుండగా, 2020-21లోనూ అదే ట్రెండ్ కొనసాగింది.