మహబూబ్నగర్: జిల్లాలోని మూసాపేట మండలంలో ఓ మహిళ దారుణహత్యకు గురయ్యింది. మండంలోని పూల్కంపల్లిలో ఇంట్లో ఉన్న మహిళను గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. శనివారం రాత్రి గ్రామానికి చెందని అంజమ్మ అనే మహిళ ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆమెను హత్యచేశారు. తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకని పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.