నల్లగొండ : ఓ వృద్ధురాలిని సమాధి చేసిన రోజే.. ఆమె మృతదేహాన్ని గుర్తు తెలియని దుండగులు తవ్వి బయటకు తీశారు. ఈ ఘటన కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామంలో వెలుగు చూసింది. బుచ్చమ్మ అనే వృద్ధురాలు శుక్రవారం మరణించగా.. అదే రోజు వారి సొంత వ్యవసాయ భూమిలో సమాధి చేశారు.
ఇక రాత్రికి రాత్రే.. గుర్తు తెలియని దుండగులు బుచ్చవ్వ మృతదేహాన్ని తవ్వి.. రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బుచ్చవ్వ కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని తవ్వి బయటకు తీసిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.