హైదరాబాద్ : పట్టభద్రుల ఉప ఎన్నిక(Graduate by-election) పోలింగ్ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో మద్యం షాపులు బంద్(Wine Shops) కానున్నాయి. ఎన్నికల నేపథ్యంలో మూడు జిల్లాల్లో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేయనున్నారు. ఎన్నికలు(MLC Elections) ముగిసేంత జిల్లాల్లో మద్యం దుకాణాలను బంద్ చేయనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.