వరంగల్ : గ్రేటర్ వరంగల్ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసి ఉంటాయని తెలిపారు. ఈ నెల 30వ తేదీన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మద్యం దుకాణాలపై నిషేధం విధించారు. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు రోజున కూడా మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ తరుణ్ జోషి హెచ్చరించారు.