భూపాలపల్లి రూరల్, జూన్ 9: భూపాలపల్లి మండలంలోని రాంపూర్ కమలాపూర్ గ్రామాల మధ్యలో ఆదివారం రాత్రి ఇన్నోవా కారు బైక్ను ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడారం నుంచి భూపాలపల్లికి ఇన్నోవా (టీఎస్ 25సి 9999) వాహనం అతివేగంగా వస్తూ బైక్ను ఢీ కొట్టడంతో కమలాపూర్ గ్రామానికి చెందిన రేగళ్ల నరేశ్ (33) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా భూపాలపల్లిలోని దవాఖానకు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. కాగా ఇన్నోవా వాహనంపై సీఎం రేవంత్రెడ్డి ఫొటో ఉన్నదని, కారు ఢిక్కీలో ఏదో వన్యప్రాణి మాంసం లభించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రసాద్ తెలిపారు.