హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు 6 వేల మందికిపైగా విద్యార్థి సైన్యాన్ని తయారు చేసినట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయెల్ తెలిపారు. విద్యాశాఖ సమన్వయంతో చేపట్టిన ‘సైబర్ అంబాసిడర్ ప్లాట్ఫామ్ (సీఏపీ)’ కార్యక్రమం ద్వారా 6 వేల మందికిపైగా విద్యార్థులు ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందారని శుక్రవారం ఆమె ట్విట్టర్లో వివరించారు. వీరంతా సైబర్ నేరాలను నిరోధించడంపై ప్రజల్లో, వారి కమ్యూనిటీల్లో, బంధువులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. సైబర్ అంబాసిడైర్లెన ఈ విద్యార్థులకు మూడు నెలల పాటు వర్చువల్గా శిక్షణ ఇచ్చినట్టు ఏడీజీ శిఖాగోయెల్ తెలిపారు.