కడుపునొప్పి తాళలేక మహిళ విలవిల
తన కారులో దవాఖానకు తరలింపు
సారపాక, ఏప్రిల్ 10: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను తన వాహనంలో దవాఖానకు తరలించి ఔదార్యాన్ని చాటుకున్నారు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. సారపాకకు చెందిన ఓ మహిళ కడుపునొప్పితో బాధపడుతుండగా శనివారం కుటుంబీకులు ఆటోలో భద్రాచలానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆర్టీసీ బస్సు మరమ్మతులకు గురై భద్రాచలం బ్రిడ్జిపై ఆగిపోయింది. ట్రాఫిక్ జామ్ అయి వాహనాలన్నీ నిలిచిపోయాయి. అదే సమయంలో ఆ దారిలో వస్తున్న రేగా కాం తారావు.. మహిళ అవస్థను చూసి స్పందించారు. బాధితురాలిని తన కారులో ఎక్కించి వ్యక్తిగత సిబ్బంది సాయంతో ట్రాఫిక్ క్లియర్ చేయించి హుటాహుటిన పాల్వంచలోని ఓ దవాఖానకు తరలించారు.