తెలంగాణ కశ్మీర్గా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా విభిన్న వాతావరణం నెలకొంటున్నది. ఉదయం మంచు కురుస్తుండగా.. మధ్యాహ్నం ఎండ కాస్తున్నది. సాయంత్రం వేళలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నది. గురువారం ఉదయం 8 దాటినా జాతీయ రహదారితోపాటు గుడిహత్నూర్ నుంచి ఉట్నూర్ వెళ్లే దారిలో తోషం వద్ద మంచు కురిసింది. రోడ్డు సరిగ్గా కనిపించక వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్లాల్సి వచ్చింది.
– ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ