హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ నిర్వహించిన రాజశ్యామల యాగం శుక్రవారంతో ముగిసింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీశారదాపీఠం ఆధ్వర్యంలో వైదిక నియమాలను అనుసరిస్తూ, 3 రోజులపాటు రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం కొనసాగింది. శుక్రవారం మహా పూ ర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. తెలంగాణ ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ఈ యాగాన్ని నిర్వహించారని పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కంకణం కట్టుకున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. ఈ యాగంతో తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుందని అన్నా రు. అనంతరం యాగంలో మంత్రించిన జలాలను కేసీఆర్ దంపతులపై చల్లారు.
వేదోక్తంగా మహా పూర్ణాహుతి
యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శుక్రవారం నర్తనకాళి అలంకరణలో దర్శనమిచిచ్చా రు. వేకువజాము నుంచే రాజశ్యామల, సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాల హవనం ప్రారంభమైం ది. పూర్ణాహుతి సమయానికి నిర్దిష్ట సంఖ్యలో మూడు లక్షల సార్లు హవనాలను పూర్తి చేశారు. మహా పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులతోపా టు బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు. పూర్ణాహుతిలో వినియోగించే పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సమక్షంలో కేసీఆర్ దంపతులు పూజలు చేశారు. శూలిని దుర్గ కవచంతో అభిమంత్రించిన రక్షను కేసీఆర్కు కట్టా రు. శ్రీశారదాపీఠం నుంచి తెప్పించిన అమ్మవారి శేషవస్త్రాలను కేసీఆర్ దంపతులకు ఇచ్చారు.