CCMB | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): వేల సంవత్సరాల జీవవైవిధ్యానికి పశ్చిమ కనుమలు కేంద్రంగా ఉన్నాయి. వేల ఏండ్ల నాటి వృక్షజాతులు, క్రిమికీటకాలు ఇక్కడ మనుగడ సాగిస్తున్నాయి.
ఇక్కడి సుస్థిరమైన భూవాతావరణం కారణంగానే ఇది సాధ్యమైందని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొన్నారు. కొంతకాలంగా పశ్చిమ కనుమల్లో పర్యటిస్తున్న సీసీఎంబీ పరిశోధకులు ఇక్కడి జంతుజాలం, వృక్షజాతులపై అధ్యయనం చేస్తున్నారు.