బొల్లారం, సెప్టెంబర్ 1: సికింద్రాబాద్.. బొల్లారం ప్రాంతంలోని 20 మద్రాస్ రెజిమెంట్కు చెందిన కోటే, బెటాలియన్ మ్యాగజైన్లో ఆయుధాల చోరీ కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 31న కోటే, మందుగుండు సామగ్రి నిల్వచేసే మ్యాగజైన్ తెరిచినప్పుడు తాళాలు పగులకొట్టి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే సామగ్రి నిల్వలను పరిశీలించగా సర్వీస్ వెపన్లు, మ్యాగజైన్లు, నైట్విజన్ పరికరం, మందుగుండ్లు కనిపించకపోవడం గుర్తించారు.
వీటి విలువ రూ.15 లక్షలుగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆర్మీ అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించి, పోలీసులకు సమాచారం అందించారు. మద్రాస్ రెజిమెంట్ లెఫ్టినెంట్ కల్నల్ మయాంక్ గోవితిర్కర్ ఫిర్యాదుమేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు.