నారాయణపేట : కాంగ్రెస్ ( Congress ) అరాచక పాలనపై ప్రజలను చైతన్యం చేస్తామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ( Chittem Rammohan Reddy ) ప్రకటించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని నివాసంలో సోమవారం నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 2 నుంచి మక్తల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలను చైతన్యం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
కాంగ్రెస్ రాబందుల పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు ప్రతి కార్యకర్త సమాయ త్తం కావాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.