ఆదిలాబాద్ : మహారాష్ట్ర సరిహద్దు పెన్ గంగా నదిపై నిర్వహిస్తున్న చెనాక -కోరాట ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది జూన్ నాటికి రైతులకు సాగునీరు అందిస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంగళవారం ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్తో కలిసి ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లాలో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుందని తెలిపారు.
బరాజ్, కాలువ పనులు చివరి దశకు చేరుకున్నాయని, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.