హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): క్రెడిట్, డెబిట్కార్డు తరహాలో విద్యార్థులకు యువవికాసం పథకంలో భాగంగా విద్యాభరోసా కార్డుల ను అందజేస్తామని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించా రు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రామ్మెహన్రెడ్డి ప్రవేశపెట్టగా, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బలపరిచారు. విద్యాభరోసాకార్డులో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తామని చెప్పా రు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ను నెలకొల్పుతామన్నారు.