హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ):అతి త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. బీపీఎల్ కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధిచేకూరుతుందని తెలిపారు. సింగరేణిలో మరో 850 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ను నెలకొల్పాల్సిన అవసరమున్నదని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వనున్నామని, ఇంటి స్థలం లేని వారికి 250 గజాల స్థలాన్నిచ్చి ఇండ్లను నిర్మించి ఇస్తామని, అవసరమైతే కొనుగోలు చేసి అయినా స్థలాలిస్తామని పేర్కొన్నారు.