నిజాంసాగర్, జూన్ 25: నిజాంసాగర్ నీటిని సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్ల ద్వారా స్పీకర్ శనివారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదన్నారు. అలీసాగర్ వరకు 1.35 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు మొదటి విడతగా విడుదల చేశామని తెలిపారు.
అక్టోబర్ వరకు ఆరు విడతల్లో 9 టీఎంసీల వరకు విడుదల చేస్తామన్నారు. ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా పది రోజులపాటు ఆన్ ఆఫ్ పద్ధతిలో వదులుతామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఆయకట్టు రైతుల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.