కాళేశ్వరం, ఏప్రిల్ 6 : కాళేశ్వరంలోని లక్ష్మీ(కన్నెపల్లి) పంప్హౌస్లో బుధవారం నుంచి ఎత్తిపోతలు మొదలయ్యాయి. మూడు మోటర్ల ద్వార ఇంజినీర్లు సరస్వతి(అన్నారం) బరాజ్కు 6600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. కన్నెపల్లి పంప్హౌస్లోని 15, 16,17వ మోటర్లు నిరంతరం నడుస్తూ నీటిని డెలవరీ సిస్టర్న్ నుంచి గ్రావిటీ కెనాల్లో ఎత్తి పోస్తున్నాయి. పైపుల ద్వారా పోసిన నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా సరస్వతి బరాజ్కు తరలుతున్నాయి. సరస్వతి బరాజ్లో ప్రస్తుతం 08.32 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.