హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ): మహిళా సాధికారతకు పాటుపడటంతోపాటు వైద్యరంగంలో నిస్వార్థ సేవలందించి హైదరాబాద్కు చెందిన వైద్యురాలు డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్కు ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ అవార్డు లభించింది. ఈ నెల 30న వర్చువల్గా జరిగే 29వ యుధ్వీర్ స్మారక అవార్డుల ప్రధానోత్సవంలో ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు. అవార్డు కింద రూ.1లక్ష నగదు, జ్ఞాపికను అందజేస్తారు. మూడు దశాబ్దాలుగా గైనకాజిస్ట్గా సేవలందిస్తున్న ఆమె, ప్రస్తుతం ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్పర్సన్ వ్యవహస్తున్నారు. ఆపరేషన్లు లేకుం డా గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేసేందుకు డాక్టర్ ఎవిటా చొరవ తీసుకున్నారు. ఇందుకు గాను PROMISE ( ఫ్రొఫెషనల్ మిడ్వైఫరీ సర్వీసెస్) క్యాంపెయిన్ను నిర్వహించారు.