సుబేదారి, జూన్ 8: వరంగల్ కేంద్రంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన 15 మంది నిందితులను టాస్ఫోర్స్, పోలీసులు వ్యవసాయశాఖ అధికారులతో కలిసి అరెస్టు చేశారు. వీటి విలువ రూ.2.11కోట్లు ఉం టుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ ముఠాలో ప్రధాన నిందితుడు దాసరి శ్రీనివాస్రావు.. భాస్కర్రెడ్డి అనే వ్యక్తితో కలిసి ముఠా సభ్యుల ద్వారా రైతుల నుంచి తక్కువ ధరకు పత్తి విత్తనాలు కొనుగోలు చేసి కర్ణాటకలో శుద్ధి చేశాడు. వా టిని ప్రముఖ బ్రాండెడ్ విత్తన కంపెనీల మాదిరిగా.. క్యూ ఆర్ కోడ్, ఎంఆర్పీ ముద్రించారు. ఆ నకిలీ విత్తనాలను తెలంగాణ, మహారాష్ట్రలో రైతులకు విక్రయిస్తున్నారు. వీరి నుంచి 7టన్నుల విడి విత్తనాలు, 9,765 నకిలీ విత్తనాల ప్యాకెట్లు, డీసీఎం, కారు, రూ.21 లక్షల నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు సీపీ రంగనాథ్ తెలిపారు.