హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తదుపరి విచారణను సీబీఐ కోర్టు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. నిందితులను పోలీసులు శుక్రవారం కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, ఉమాశంకర్రెడ్డిని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణను న్యాయస్థానం మార్చి 10కి వాయిదా వేసింది. కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులు శివశంకర్రెడ్డి, ఉమాశంకర్రెడ్డి, సునీల్యాదవ్ను చంచల్గూడ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో ఇద్దరు నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్గా మారిన దస్తగిరి బెయిల్పై బయటే ఉన్నారు.