హైదరాబాద్ సిటీబ్యూరో/జవహర్నగర్, సెప్టెంబర్ 16: చెత్తతో విద్యుత్తును ఉత్పత్తి చేయడం అద్భుతమని, హైదరాబాద్లోని చెత్తను జవహర్నగర్ డంపింగ్ యార్డ్కు తరలించి ఆధునిక టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించడం అభినందనీయమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంంగాణ ప్రభుత్వ పనితీరును కొనియాడారు. జవహర్నగర్ డంపింగ్ యార్డులో చెత్త నుంచి కరెంట్, గ్యాస్ను తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించామని, ఇదే తరహాలో కర్ణాటకలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై స్టడీ టూర్లో భాగంగా శనివారం డంపింగ్యార్డ్ను సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాంకీ సంస్థ అధికారులు శివకుమార్కు డంపింగ్ యార్డ్ గురించి వివరించారు. డంపింగ్యార్డ్లో కొత్త టెక్నాలజీతో చేస్తున్న అధ్యయనాలు బాగున్నాయని శివకుమార్ ఈ సందర్భంగా కితాబిచ్చారు. తొలుత బెంగళూరు మహానగర పాలక ఐఏఎస్ల బృందం నగరాన్ని సందర్శించింది. బెంగళూరు మహానగర పాలిక చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్, డిప్యూటీ సీఎం సెక్రటరీ రాజేంద్ర చోలన్, ఎస్డబ్ల్యూఎం స్పెషల్ కమిషనర్ డాక్టర్ హరీశ్కుమార్, చీఫ్ ఇంజినీర్ బస్వరాజ్ , డీజీఎం చంద్రశేఖర్ ఎస్డబ్ల్యూఎం (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)పై అధ్యయనం చేశారు. కార్యక్రమంలో రాంకీ సంస్థ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.