హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవుల్లో తిరుమలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఈ రద్దు నిర్ణయం వచ్చే మూడు నెలలపాటు అమల్లో ఉండనున్నట్టు వెల్లడించారు. ఎక్కువ మంది సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనాన్ని త్వరగా కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.