హైదరాబాద్: రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం ఈనెల 21వ తేదీన జరగనుంది. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం కూడా అదే రోజు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ వాల్ పోస్టర్ ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ చైర్మన్, ఎమ్మెల్సీ, ప్రకాశ్ ఆవిష్కరించారు.
ప్రతి గ్రామంలో, పట్టణంలో, జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో ముదిరాజ్ జెండాలను ఎగురవేయాలని వారు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముదిరాజులు లబ్ధి పొందారని అన్నారు. మంత్రుల నివాస ప్రాంగణంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను, విద్యార్థి జేఏసీ నాయకుడు అల్లుడు జగన్, రాష్ట్ర నాయకుడు డి.ఎల్. పాండు, తదితరులు పాల్గొన్నారు.