కరీంనగర్ : జాతీయ విద్యావిధానంపై విస్తృత చర్చ జరిపిన తర్వాతనే పకడ్బందీగా అమలు చేయాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020లో ఉన్నత విద్య అమలు చేయుడంలో సవాళ్లు, దృక్కోణాలపై శాతవాహన యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కార్యశాలను యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య మల్లేశ్ సంకశాలతో కలిసి ప్రారంభించారు.
అనంతరం వినోద్ కుమార్ మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించి అత్యున్నత పౌరులను తీర్చిదిద్దడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలో అత్యున్నత విజ్ఞాన దేశంగా తీర్చిదిద్దవచ్చన్నారు. విద్యార్థులకు అత్యున్నతమైన విద్యను అందిస్తూ వారిలో మానవీయ విలువలను పెంపొందించే మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ అకాడమిక్ బ్యాంక్, మాతృభాషలో బోధన లాంటి అంశాలు అమలయ్యేట్లు చూడాలన్నారు. ఇందుకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించి, అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. దీనిని అమలు చేయడంలో విద్యా సంస్థలు, పాలకులు, యంత్రాంగం అనేక సమస్యలు, సవాళ్లను ఎదురొంటున్నాయని, వాటిని ప్రభుత్వం పరిషరించి తగిన మార్గాన్ని సూచించాలని పేరొన్నారు.
కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన అఖిల భారతీయ రాష్ట్రీయ సంయుక్త మహా సంగ్ జాతీయ కార్యదర్శి గుంత లక్ష్మణ్ మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానం అత్యంత గొప్పదన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించడంతోపాటు, మానవీయ విలువలను పెంపొందించడం ద్వారా అత్యున్నత జ్ఞానాన్ని అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ సామాజిక శాస్త్రాల మాజీ డీన్ ఆచార్య చెన్న బసవయ్య ప్రముఖ వక్తగా హాజరై విస్తృత ఉపన్యాసం చేశారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య సంకశాల మల్లేశ్ మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం 2020ని అమలు చేసేందుకు ప్రభుత్వాలు, విద్యారంగ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని, అమలుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. ఇక్కడ ఎస్యూ రిజిస్ట్రార్ ఎం వరప్రసాద్, ప్రత్యేక అధికారి వన్నాల రమేశ్, కార్యశాల డైరెక్టర్ డాక్టర్ డీ హరికాంత్, ఆచార్య కే సాయిలు, డాక్టర్ ఈ మనోహర్, డాక్టర్ కే తిరుపతి, డాక్టర్ మనోజ్, డాక్టర్ కృష్ణ కుమార్, అనుష, బి నరేష్, డాక్టర్ పరశురాములు ఉన్నారు.