రాజోళి, ఫిబ్రవరి 6 : కేసీఆర్ సర్కారు చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మా రాయని, ఆ పథకం చాలా బాగుండేదని మహారాష్ట్ర అధికారుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కేసీఆర్ హయాంలో జాతీయ స్థాయి అవార్డు అందుకున్న జోగులాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం మాన్దొడ్డి గ్రామాన్ని మంగళవారం మహారాష్ట్రకు చెందిన 30 మం ది అధికారుల బృందం సందర్శించింది.
ఎవె న్యూ ప్లాంటేషన్, పల్లెప్రగతి, ‘మన ఊరు-మన బడి’ వంటి పథకాలతో జరిగిన అభివృద్ధిని పరిశీలించారు. పల్లెప్రగతి, ఈజీఎస్ నిధులతో రహదారుల నిర్మాణాలు, పాఠశాలలకు మరమ్మతులు, కొత్త గదుల నిర్మాణం వంటి వాటిపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం నిర్వహించిన పనులపై మహారాష్ట్ర ఎం పీడీవోలకు, సర్పంచులకు మహారాష్ట్ర డిప్యుటీ సీఈవో అవగాహన కల్పించారు.